
కరివేపాకు, మునగాకుల పొడికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు కరివేపాకు ఆకులు, రెండు కప్పులు మునగాకులు, పావు కప్పు శనగపప్పు, పావు కప్పు మినప్పప్పు , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి , 8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి.

ఆకుకూరల పొడి తయారీ విధానం: ముందుగా ఆకులను తీసుకుని వాటిని సిద్ధం చేసుకోవాలి. ఒక కప్పు కరివేపాకు, మునగాకులను కూడా వేసి బాగా కడిగి ఆరబెట్టాలి. ఇక ఇప్పుడు పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకును ఎర్రగా వేయించాలి. అదే పాన్ లో మునగాకులు కూడా వేసి మీడియం మంటపై బాగా వేయించుకోవాలి

ఆకుకూరల పొడి తయారీ విధానం స్టెప్ 1: పప్పులను కూడా ఇలా వేయించుకోవాలి: మళ్ళీ అదే పాన్లోకొద్దిగా శనగపప్పు, ఇంకా మినప్పప్పు, ధనియాలు, అలాగే జీలకర్రను కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఎండుమిర్చిని బాగా వేయించి పక్కన పెట్టాలి. ఇంకా వీటితో పాటు చింతపండును కూడా రెడీ చేసుకోవాలి.

చింతపండులోని గింజలను తీసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి ఇంకా ఈ మిక్సీ జార్లో పప్పులు, ముక్కలు చేసిన ఎండుమిర్చి, ఇంకా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి దీనిని పొడిలాగా చేసుకోవాలి. ఇక ఇప్పుడు వేయించిన కరివేపాకు ఆకులు అలాగే మునగాకులు, కొద్దిగా చింతపండు, నాలుగు వెల్లుల్లి , ఇంకా ఉప్పుతో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

ఇక ఈ పొడిని మీరు చల్లారనిచ్చిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఒక పాత్రలో కానీ మీరు నిల్వ చేయాలి. సీసాలో అయితే, కొంచం కూడా తేమలేని, గాలి అస్సలు చొరబడని వాటిలో నిల్వ ఉంచితే 20 రోజుల వరకు చెక్కు చెదరదు. ముఖ్యంగా, దీనిని కంటి చూపు సరిగా లేని వాళ్లు ఆకుకూరలతో ఇలా పొడి చేసి తింటే ఇక కళ్ళ జోడు వాడరు