అస్తవ్యస్త జీవనశైలి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, పొగాకు, సిగరెట్ల వినియోగం ఇందుకు ప్రధాన కారణం. ధూమపానానికి దూరంగా ఉండటం, ఆహారంలో ఉప్పు తగ్గించి తినడం, పండ్లు కూరగాయలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని అనేక అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది.
పండ్లు, కూరగాయలు, గింజలు, చేపలు, పప్పులు, కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులను తీసుకోని వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువని యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనం వెల్లడించింది.
గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే ప్రాసెస్ చేయని మాంసం, ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.
రోజుకు 2 నుంచి 3 సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. రోజుకు ఒకసారి గింజలు, రోజుకు రెండుసార్లు పాల ఉత్పత్తులు తినాలి. వారానికి 3 నుంచి 4 రోజులు పప్పులు, వారానికి 2 నుంచి 3 రోజులు చేపలు తినాలని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే కనీసం వారానికి ఒకసారైనా తృణధాన్యాలు, ప్రాసెస్ చేయని రెడ్ మీట్లను కూడా తినాలని సూచిస్తున్నారు.