
కరోనా అనంతరం ప్రస్తుతం గుండెపోటు సమస్య చాలా ఎక్కువైంది. గుండెపోటుకు వయోపరిమితి లేదు. ఏ వయసు వారైనా గుండెపోటుకు గురవుతున్నారు . గుండెపోటు ఎంత ప్రాణాంతక వ్యాధిగా మారిందంటే.. నవ్వుతూ నడుస్తూ డ్యాన్స్ చేస్తూ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే ఈ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి చాలా సాధారణం.

అయితే ఛాతీ నొప్పి మాత్రమే కాదు ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చేతుల్లో నొప్పి, దంతాలు, చిగుళ్లలో నొప్పి, వాటి నుంచి రక్తస్రావం చాలా ఎక్కువ అవ్వడం కూడా గుండెపోటుకు చిహ్నాలే

వైద్యుల ప్రకారం దంతాలు, చిగుళ్ళలో మురికి పేరుకుపోతుంది. చిగుళ్లలో ఉండే బాక్టీరియా శరీరం అంతటా ప్రయాణించగలదు. ఇది గుండె నాళాలలో మంటను , గుండె కవాటాలలో ఇన్ఫెక్షన్ను ప్రేరేపిస్తుంది.

పంటి నొప్పి, వాపు , దంతాల నుంచి రక్తస్రావం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

దంతాలు, చివుళ్లు నొప్పి తీవ్రతరం అయినా.. పంటి నుంచి రక్తస్రావంతో పాటు చివుళ్లు వచ్చినా గుండె సమస్యకు సంకేతాలు.. అంతేకాదు అదనంగా అధిక చెమట, గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు అని చెప్పవచ్చు.

కాబట్టి మీలో ఈ లక్షణాలు కనిపిస్తే రెడ్ అలర్ట్ గా భావించండి. అంటే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే గుండె పోటుని తప్పించుకోలేరు. మీరు మీ జీవితాన్ని రక్షించుకోలేరు. కనుక ముందుగా ఈ లక్షణాలు హెచ్చరికగా భావించమని చెబుతున్నారు.