
తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బుధ వారం రోజు భారీ వర్షాలు కురవడంతో వాగులు, నదులు , చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు బయటకు రాకూడదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అయితే పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉదృతి పెరిగింది. దీంతో రహదారులు కొట్టుకుపోయి వాహనాల రాకపోపకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు, హైదరాబాద్, మెదక్ ఇలా పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదు అయ్యింది.

ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో 10 జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేశారు. బుధవారం భారీ వర్షాలు పడగా, గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.

కరీంనగర్లో వర్షం దంచి కొడుతుంది. మంగళ వారం రాత్రి చిరు జల్లులతో మొదలైన వర్షం, బుధవారం దంచి కొడుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా అధిక వర్షాపాతం నమోదు అవుతుంది. ముఖ్యంగా కరీంనగర్లో జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

సిద్దిపేట జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో తొగుటలొ వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోజంతా వర్షం కురుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం సిద్ధిపేటతో పాటు, పశ్చిమ తెలంగాణ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నదంట.