Telangana: తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. వాటి పెంపు లేనట్లే.. ప్రభుత్వం క్లారిటీ

Updated on: Feb 06, 2026 | 10:51 AM

తెలంగాణలో ఆస్తి పన్ను, నల్లా బిల్లులు పెంచుతారనే వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిది. ఈ మేరకు అలాంతి ప్రతిపాదన లేదని మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కరీంనగర్‌లో ఆయన మున్నిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంపుపై స్పష్టతిచ్చారు.

1 / 5
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు ప్రభుత్వం పెంచనుందనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి అసలు లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు ప్రభుత్వం పెంచనుందనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి అసలు లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

2 / 5
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆస్తి, నల్లా బిల్లులు వంటివి పెంచుతామనేది అవాస్తమవని, ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదన ఏదీ లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి పన్నులు పెంచలేదని, కేంద్ర ప్రభుత్వమే అన్నీ పన్నులు పెంచిందని విమర్శించారు. తమకు అలాంటి ఆలోచన లేదని, ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆస్తి, నల్లా బిల్లులు వంటివి పెంచుతామనేది అవాస్తమవని, ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదన ఏదీ లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి పన్నులు పెంచలేదని, కేంద్ర ప్రభుత్వమే అన్నీ పన్నులు పెంచిందని విమర్శించారు. తమకు అలాంటి ఆలోచన లేదని, ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు

3 / 5
తమ ప్రభుత్వం వద్ద ట్యాక్సుల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తాము పన్నులు పెంచకుండా అభివృద్ది దిశగా దూసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టించాయని ఆరోపించారు.

తమ ప్రభుత్వం వద్ద ట్యాక్సుల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తాము పన్నులు పెంచకుండా అభివృద్ది దిశగా దూసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టించాయని ఆరోపించారు.

4 / 5
దేశంలోని అనేక రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కరీంనగర్‌లోని డంపింగ్ యార్డుకు మాత్రే నిధులు ఇవ్వడం లేదని శ్రీధర్ బాబు విమర్శించారు. కరీంనగర్ మేయర్ స్థానాన్ని తామే గెలుచుకుంటామని, అనంతరం అభివృద్దిపై శ్వేతపపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.

దేశంలోని అనేక రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కరీంనగర్‌లోని డంపింగ్ యార్డుకు మాత్రే నిధులు ఇవ్వడం లేదని శ్రీధర్ బాబు విమర్శించారు. కరీంనగర్ మేయర్ స్థానాన్ని తామే గెలుచుకుంటామని, అనంతరం అభివృద్దిపై శ్వేతపపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.

5 / 5
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ఆర్శిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేశాయని శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. తాము పరిస్ధితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ఆర్శిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేశాయని శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. తాము పరిస్ధితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.