
సాధారణంగా ఏజెన్సీలో ఉండే ఆదివాసీలు చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు.. ఏదయినా అనారోగ్య సమస్యలు తలెత్తినా.. అడవుల్లో దొరికే మూలికలు, అటవీ ఉత్పత్తులతో నయం చేసుకుంటారు.. ప్రతిరోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారు.. కల్తీ లేని ఆహారం తింటూ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన గాలి పీలుస్తూ జీవనం సాగిస్తారు.

తెలంగాణ సరిహద్దులోని దట్టమైన అటవీప్రాంతంలో ఆదివాసీలు ఆరోగ్యం రహస్యం ఇదే అని వారు చెబుతూ ఉంటారు. స్వచ్ఛమైన గాలితో కల్మషం లేని ఆదివాసీల గిరిజన గ్రామాల్లో ఇళ్లన్నీ సందడిగా మారాయి. వారు సహజ సిద్ధంగా దొరికే పదార్థాలను ఇష్టంగా తింటారు. అంతేకాకుండా అడవి తల్లిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తారు.

చర్ల మండలంలోని ఎర్రంపాడు, చెన్నాపురం, కొండివాయి, బత్తినపల్లి గ్రామాల్లో ఏ ఇంట్లో చూసినా ఆడ మగ తేడా లేకుండా దంపుడు బియ్యం చేస్తూ ఆదివాసీలు బిజీ అయ్యారు. ఆదివాసీల కుటుంబాల్లో తర తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆర్థికంగా లేకపోయినా తమ ఆరోగ్యానికి బలాదూర్ అయిన అసలు రహస్యమైనవి దంపుడు బియ్యమే అని చెప్తున్నారు ఆదివాసీలు.

వేసవి కాలం రావడంతో ఎండ తీవ్రతకు చల్లని నీటితో దాహం తీర్చుకునేందుకు ప్రకృతిలో దొరికే సొరకాయ బూరలో నీరు పోసి చల్లగా మారాక నీటిని వినియోగిస్తూ మన్యం ప్రిడ్జ్ గా చెప్తూ సంబర పడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా దంపుడు బియ్యం, సొరకాయ బూరల వినియోగమే దర్శనమిస్తున్నాయి.

దంపుడు బియ్యం ప్రకృతి సహజసిద్ధమైన ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా.. వందేళ్ల పాటు బతకవచ్చని పేర్కొంటున్నారు గిరిజనులు.. అంతేకాకుండా.. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని పేర్కొంటున్నారు.