ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ గతేడాది డిసెంబర్లో సామ్సంగ్ గ్యాలక్సీ ఏ15 పేరుతో ఓ ఫోన్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మిడ్ రేంజ్ వేరియంట్లో తీసుకొచ్చిన ఈ ఫోన్లో మంచి ఫీచర్లను అందించారు. తాజాగా ఈ ఫోన్పై కంపెనీ మంచి ఆఫర్ అందిస్తోంది.
గ్యాలక్సీ ఏ15 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచింగ్ సమయంలో రూ. 19,499కాగా ప్రస్తుతం రూ. 1500 డిస్కౌంట్తో రూ. 17,999గా నిర్ణయించారు. అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,499కాగా.. రూ. 3000 డిస్కౌంట్తో ప్రస్తుతం రూ. 19,499కే సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇంఉదలో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ను అందించారు. 5జీ సపోర్ట్ ఫోన్లో మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమోరీని పెంచుకోవచ్చు.
ఈ ఫోన్లో 6.5 ఇంచెస్తో కూడిన ఫుల్హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్తో ఈ స్క్రీన్ను తీసుకొచ్చారు. 900 నిట్స్ బ్రైట్ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.