
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ13 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం అమెరికాలో విడుదలైంది. త్వరలోనే భారత్లో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

6.5 ఇంచెస్ 90 హెచ్జెడ్ ఇన్ఫినిటీ వీ డిస్ప్లేను ఈ స్మార్ట్ ఫోన్లో అందించారు. ఇక ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్తో రూపొందించారు.

కెమెరాకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

ఇక 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో తీసుకొచ్చిన ఈ ఫోన్లో 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000ఏంహెచ్ బ్యాటరీని అందించారు.

5జీ సపోర్ట్తో రూపొందించిన ఈ ఫోన్ అమెరికాలో 250 డాలర్లకు అందుబాటులో ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 18వేలుగా ఉంది.