సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో భాగంగా గ్యాలక్సీ ఎమ్35 ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ను మిడ్ రేంజ్ బడ్జెట్ను టార్గెట్ చేసుకొని తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.
సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్35 5జీ ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.ఇక ఈ ఫోన్లో 6.6 ఇంచస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేను ఇచ్చారు 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ 100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ స్క్రీన్ సొంతం.
ఇక ఈ ఫోన్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 130 ప్రాసెసర్ను ఇచ్చారు. ఈ స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా విక్టస్+ ప్రొటెక్షన్ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్,8 మెగాపిక్సెల్స్ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఈ స్మార్ట్ ఫోన్ను మూడు స్టోరేజీ వేరియంట్లలో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999.. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.21,499, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమ్మకాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. లాంచింగ్ ఆఫర్లో భాగంగా అన్ని ఆఫర్స్ కలుపుకొని రూ. 3 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.