
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్05 ఫోన్ను తీసుకొచ్చారు. గురువారం ఈ ఫోన్ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్లో, మంచి ఫీచర్లను ఈ ఫోన్లో అందించారు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఈ ఫోన్ను 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్తో లాంచ్ చేశారు. ఇక ధర విషయానికొస్తే 4 బీజీర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ. 7,999గా నిర్ణయించారు.

అమెజాన్తో పాటు సామ్సంగ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ను మింట్ గ్రీన్ కలర్లో తీసుకొచ్చారు. ఇందులో 25 వాట్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇంత తక్కువ ధరలో 50 ఎంపీ కెమెరా రావడం విశేషం.

ఇక ఫోన్లో 6.74 ఇంచెస్తో కూడిన హెచ్డీ+ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. వర్చువల్ గా ర్యామ్ కెపాసిటీ 8 జీబీ వరకూ పెంచుకునే అవకాశం కల్పించారు. సెక్యూరిటీ కోసం ఇందులో ఫేస్ అన్ లాక్ ఫీచర్ను ఇచ్చారు.