చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. రియల్మీ జీటీ నియో 6 పేరుతో కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో లాంచ్ చేసిన ఈ ఫోన్ను త్వరలోనే భారత్లోకి తీసుకురానున్నారు. చైనాలో ఈ ఫోన్ తొలి సేల్ మే15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. అలాగే ఈ ఫోన్ను 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్తో లాంచ్ చేశారు.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 1.5కే రిజల్యూషన్తో కూడి 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందించే స్క్రీన్ను అందించారు. 4ఎన్ఎమ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్3 ఎస్ఓసీ ప్రాసెసర్ను ఇచ్చారు.
ఇక ఈ ఫోన్లో 120 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ 5జీ ఫోన్లో వైఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే.. ప్రారంభ వేరియంట్ ధర రూ. 22,000 కాగా హైఎండ్ ధర రూ. 34,500 వరకు ఉండనుంది.