చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తాజాగా చైనాలో k9s పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ను త్వరలోనే భారత్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన TFT LCD ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. యాపిల్ ఐఫోన్ 13 డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో సమానం కావడం విశేషం.
ఈ స్మార్ట్ ఫోన్ వేడెక్కకుండా ఇందులో ఏడు రకాల థర్మల్ డిసిపేషన్ మెటీరియల్స్తో పాటు 0.15 మి.మీ. వరకు గ్రాఫైట్ షీట్ను అందించారు.
కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం.
5,000mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బ్యాటరీ కేవలం గంటలోనే 100 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే భారత మార్కెట్లో ఇంకా ధరను స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ రూ. 18 వేల నుంచి రూ. 20 వేల మధ్యలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.