
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ తయారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త సిరీస్ ఫోన్ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ1 సిరీస్లో భాగంగా ఒప్పో ఏ1ఎస్, ఒప్పో ఏ1ఐ పేరుతో రెండు కొత్త ఫోన్లను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్కు సంబంధించిన పూర్తి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.13,800, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.16,100గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్లో మౌంటెడ్ పర్పుల్, నైట్ సీ బ్లాక్, టైటాన్ షౌబీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్తో కూడిన హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ను అందించారు. 4జీ, వైఫై5, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 33 వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని ఇచ్చారు.

సెక్యూరిటీ ఫీచర్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ను అందించారు. ఒప్పో ఏ1ఐ ఫోన్ 6.56 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్ను అందించారు. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 90 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటుకు సపోర్ట్ చేస్తుంది.