ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రొడక్ట్స్పై ఏకంగా 80 వాతం వరకు డిస్కౌంట్ను అందించాయి.
జనవరి 3నుంచి 6 వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్లో భాగంగా ల్యాప్ టాప్స్పై ఏకంగా 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తున్నాయి. హెచ్పీ, ఎంఎస్ఐ, ఎల్జి, డెల్, ఏసర్, లెనోవోతో పాటు మరికొన్ని బ్రాండ్స్పై ఈ ఆఫర్ ఉంది.
వీటితో పాటు యాపిల్, శామ్సంగ్ కంపెనీకి చెందిన ట్యాబ్లెట్లపై కూడా ఆఫర్ అందిస్తున్నారు. వీటితో పాటు బోస్ ఆడియో ప్రోడక్ట్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
కెమెరాలపై కూడా ఆఫర్లు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. డిఎస్ఎల్ఆర్, మిర్రర్ లెస్ కెమెరాలపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.
ఇక సేల్లో భాగంగా ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్లపై కూడా డిస్కౌంట్ లభిస్తోంది. సేల్లో భాగంగా రూ. 2 వేల లోపు అందుబాటులో ఉన్నాయి. ఇక పవర్ బ్యాంకులు కూడా రూ. 699 నుంచి ఆఫర్లో లభిస్తున్నాయి.