మోటోరోలో భారత మార్కెట్లోకి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా పేరుతో ఓ కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానుంది. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్తోపాటు గతేడాది ఈ ఫోన్ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్3 ఎస్వోసీ ప్రాసెసర్తో పనిచే్సతుంది. 16 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ ఈ ఫోన్ సొంతం.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హెల్లో యూఐ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్లో 50 వాట్స్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్కు, 125 వాట్స్ వైర్డ్కు సపోర్ట్ చేసే 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు.
కెమెరా విషయానికొస్తే మోటో ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ను అందిస్తున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్తో కూడిన 64 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ విత్ అప్ టూ 3ఎక్స్ జూమ్, మరో రెండు 50 మెగాపిక్సెల్స్తో కూడిన కెమెరాను అందించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో డ్యుయల్ 5జీ, 4జీ, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదూ, నేవ్ ఐసీ, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. అలాగే సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ను ఇచ్చారు. అలాగే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ ఇచ్చారు.