భారత్కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేస్తోంది. లావా బ్లేజ్ 2 పేరుతో ఈ కొత్త ఫోన్ను తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9 నుంచి రూ. 10 వేల మధ్య ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ధరకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
ఇక కంపెనీ ఇప్పటి వరకు ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట లీక్ అయిన సమాచారం ఆధారంగా ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే. ఈ ఫోన్ను ఎల్సీడీ డిస్ప్లేను ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఇందులో సెంటర్ పంచ్ హోల్ను ఇవ్వనున్నారని సమాచారం.
ఇక లావా బ్లేజ్ 5జీకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ప్రాసెసర్తో పని చేయనుంది. ఈ ఫోన్ను రెండు స్టోరేజ్ వేరియంట్స్ తీసుకురానున్నారని సమాచారం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్తో రానుంది.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడా ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 8 మెగాపిక్సెల్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.