
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు మార్కెట్లోకి కొంగొత్త 5జీ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్లను తీసుకొస్తున్నారు .ఈ క్రమంలోనే లావా కొత్త ఫోన్ను తీసుకొచ్చింది.

భారత్కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. కేవలం రూ. 10వేలలోనే 5జీ ఫోన్ను తీసుకొచ్చిందీ కంపెనీ. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లావా యువ 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.52 ఇంచెస్తో కూడి ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యూనిసోక్ టీ750 ప్రాసెసర్తో పనిచేస్తుంది.

ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ పినిచేస్తుంది. ఓఎస్ అప్డేట్, రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తున్నారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 9,499 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 9,999గా నిర్ణయించారు. జూన్ 5వ తేదీ నుంచి అమ్మకాలు జరగనున్నాయి.