
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐటెల్ కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఐటెల్ ఎస్ 23 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్లో యూనిసోక్ టీ606 ప్రాసెసర్ను అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ర్యామ్ను స్టోరేజ్ నుంచి వర్చువల్గా మరో 8 జీబీ పెంచుకోవచ్చు.

ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్లో 6.6 ఇంచెస్ ఫుల్హెచ్డీ+ఐపీఎస్ డిస్ప్లేను ఇచ్చారు.

ఐటెల్ ఎస్23లో కలర్ ఛేంజింగ్ ప్యానెల్ ఫీచర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సూర్య కాంతి పడినప్పుడు ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగులు మారుతుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్లో 128 జీబీ స్టోరేజ్ను అందించారు. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంది.

ధర విషయానికొస్తే ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,799గా నిర్ణయించారు. ఇందులో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ధర ఇంకా ప్రకటించలేదు.