ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐటెల్ మార్కెట్లోకి కొత్త రకం స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఐటెల్ యూనికార్న్ పెండెంట్ పేరుతో తీసుకొచ్చిన ఈ గ్యాడ్జెట్ స్మార్ట్ వాచ్ లా మాత్రమే కాకుండా ఒక లాకెట్ లా పనిచేస్తుంది. ఫ్యాషనబుల్ గ్యాడ్జెట్ గా దీనిని రూపొందించారు. ఇంతకీ స్మార్ట్ వాచ్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ వాచ్లో నావిగేషన్ ఓకసం స్పోర్ట్స్ మోడ్ బటన్, డైనమిక్ క్రౌన్, స్విచ్ బటన్ను అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 500 నిట్స్ బ్రైట్నెస్తో కూడిన 1.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను అందించారు.
Itelఇక ఈ వాచ్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజులు నాన్స్టాప్గా పనిచేస్తుందని, 15 రోజుల స్టాండ్బై టైమ్ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ వాచ్ కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జ్ కావడం విశేషం.
ఇందులో 100కిపైగా స్పోర్ట్స్ మోడ్లతో పాటు ఫిమేల్ సైకిల్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. డ్యూయల్ కోర్ ప్రాసెసర్తో పనిచేస్తే ఈ వాచ్లో ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ను అందించారు.
ఎస్పీఓ2, 24×7 హార్ట్ రేట్, స్ట్రెస్ మానిటర్ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ వాచ్ను ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ను అందించారు. నేటి నుంచి (మే 18వ తేదీ) సేల్స్ ప్రారంభంకానున్నాయి. ధర విషయానికొస్తే రూ. 2899గా నిర్ణయించారు.