
రోజురోజుకీ స్మార్ట్ వాచ్ల వినియోగం బాగా పెరిగిపోతోన్న నేపథ్యంలో రోజుకో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రియల్మీ టెక్లైఫ్కు చెందిన సబ్బ్రాండ్ డిజో కొత్త వాచ్ను లాంచ్ చేసింది.

ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.8 ఇంచెస్ డిస్ప్లేను అందించారు. హార్ట్రేట్ మానిటర్, ఎస్పీఓ2, స్లీప్ ట్రాకర్ లాంటి ముఖ్యమైన హెల్త్ ఫీచర్లన్నీ ఈ వాచ్లో ఉన్నాయి. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్స్కు సపోర్ట్ చేస్తుంది.

డిజో వాచ్ డీ వాచ్లో 350 ఎమ్ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు. ఈ వాచ్ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 14 రోజుల పాటు నిరంతరాయంగా నడుస్తుంది.

ఈ స్మార్ట్వాచ్లో వాటర్ రెసిస్టెంట్స్ కోసం 5 ఏటీఎమ్ రేటింగ్ను అందించారు. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోన్కు ఈ వాచ్ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్కు వచ్చే అన్ని రకాల నోటిఫికేషన్లను వాచ్లో చూసుకోవచ్చు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,999 ఉంది. కాగా ఇంట్రడక్టరీ ఆఫర్గా రూ. 1999కే అందిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో ఈ వాచ్ సేల్ ప్రారంభం కానుంది.