
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. ఐటెల్ ఏ50 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఐటెల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు.

అయితే తాజాగా ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించిన కొన్ని లీక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ లీక్స్ ఆధారంగా ఐటెల్ ఏ50 స్మార్ట్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 8 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇ్వవనున్నట్లు సమాచారం.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యూనిసోక్ టీ603 ఎస్వోసీ ప్రాసెసర్తో పనిచేస్తుందని సమాచారం. సెక్యూరిటీ పరంగా చూస్తే ఈ స్మార్ట్ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ను అందించనున్నారు.

ధర విషయానికొస్తే ఐటెల్ ఏ50 4 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 7000లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రటకన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.