చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో భాగంగా ఐక్యూ జెడ్6 లైట్ 5జీ ఫోన్పై 35 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 19,999కాగా, డిస్కౌంట్లో భాగంగా రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనం 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
ప్రపంచంలో స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్తో పనిచేస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్లో ఫుల్హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్తో ఇచ్చారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఐ ఆటోఫోకస్ అనే స్పెషల్ ఫీచర్ను ఇందులో అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్లో లిథియం బ్యాటరీని అందించారు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో 1 టీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ సిమ్ అందించారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.