
గతంలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వృద్ధుల్లో మాత్రమే కనిపించేవి. కానీ ప్రస్తుతం ఈ సమస్యలు అన్ని వయసులవారినీ వెంటాడుతున్నాయి. ఐతే కొన్ని రకాల పండ్లు తింటే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

యాపిల్ పండులో విటమిన్ సి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్ తినమని వైద్యులు సూచిస్తుంటారు. క్యాల్షియం ఎక్కువగా ఉండే యాపిల్స్ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

పైనాపిల్ శరీరంలోని పొటాషియం, యాసిడ్ కారకాలను తటస్థీకరిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచుతుంది. వేసవిలో పైనాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు వనకూరుతుంది.

స్ట్రాబెర్రీ పండ్లలో పొటాషియం, విటమిన్-సితో పాటు ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా ఉంటుంది. వేసవిలో మీరు స్ట్రాబెర్రీ, పాలతో చేసిన మిల్క్ షేక్ తాగవచ్చు. పాలు ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి.

కీళ్లనొప్పులు లేదా కండరాల తిమ్మిరి ఉన్నవారు ప్రతిరోజూ ఒక అరటి పండు తప్పనిసరిగా తినాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎముకలు, దంతాల బలోపేతానికి ఈ విధమైన పోషకవిలువలు కలిగిన పండ్లు మీ రోజు వారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.