
శ్రీరామనవమి పండుగ రోజు ప్రసాదాల కంటే పానకం ప్రత్యేమైనదిగా ఉంటుంది. ఎందుకంటే, గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా తాగుతారు. ఇది చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

కావాల్సిన పదార్దాలు: రెండు టేబుల్ స్పూన్స్ మిరియాలు, ఒక కప్పు బెల్లం తురుము , 5 గ్లాస్ ల నీళ్లు, ఒక టీ స్పూన్ యాలకులు పొడిని తీసుకోవాలి. ఇంకొందరు శొంఠి పొడిని కూడా వేసుకుంటారు.

ముందుగా బెల్లాన్ని తీసుకుని తురుముకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు మిరియాలను తీసుకుని మిక్సీలో కానీ, రోటిలో కానీ బాగా దంచుకోవాలి.

ఇక ఇప్పుడు ఒక పెద్ద పాత్ర కానీ, కుండను కానీ తీసుకుని దానిలో సగం వరకు మంచి నీళ్లతో నింపండి. ఆ తర్వాత నీటిలో బెల్లం తురుము , రెండు టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి, యాలకుల పొడి వేసి మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి.

ఈ పానకం రామయ్యకి ఎంతో ఇష్టమైనదిగా చెబుతారు. దీనిని తాగితే వేడి కూడా తగ్గుతుంది. ఇది రుచికి మాత్రమే కాకుండా శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తరిమికొడుతొంది.