కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందు ఒలింపిక్ పతక విజేత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ సమాఖ్యపై తీవ్ర ఆరోపణ చేసి సంచలనం సృష్టించింది. రాజకీయాల కారణంగా తన పోటీలకు సన్నద్ధత దెబ్బతినడంతో పాటు మానసిక వేధింపులు కూడా ఎదురవుతున్నాయని లోవ్లీనా ఆరోపించింది. ఈ ఆరోపణలతో మళ్ళీ అంతర్జాతీయ పోటీలకు ముందు ఆటగాళ్లపై ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. కామన్వెల్త్, ఆసియా లేదా ఒలింపిక్ క్రీడలలో, కోచ్, ఫిజియో గురించి ఎప్పటి నుండో ఇలాంటి వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.
కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమయ్యే ముందు తన కోచ్ సంధ్యా గురున్జీ ను తనకు తెలియజేయకుండా తొలగించారని వెల్లడించింది. మళ్ళీ తిరిగి సంధ్యా గురున్జీను తిరిగి చేర్చుకున్నారని అయితే కామన్వెల్త్ విలేజ్కి ఎంట్రీ దొరకలేదు. దీంతో నా సన్నాహాలపై తీవ్ర ప్రభావం పడిందని లోవ్లినా ఆరోపించింది. సంధ్య లోవ్లినాతో కలిసి టోక్యో ఒలింపిక్స్లో కోచ్ సంధ్యా గురున్జీ పాల్గొన్నారు.
టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా ఇదే సమస్యతో పోరాడింది. ముఖ్యమైన మ్యాచ్లకు రెడీ అవుతున్న సమయంలో తనకు వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్, వ్యక్తిగత కోచ్ లేరని ఆరోపించింది. వినేష్ 2018 నుండి హంగేరియన్ కోచ్ వోలర్ అకోస్ వద్ద శిక్షణ పొందుతోంది.
వ్యక్తిగత కోచ్ విషయంలో కూడా మనికా బాత్రా వివాదాల్లో చిక్కుకుంది. టోక్యో ఒలింపిక్స్లో మనికా బాత్రా రౌండ్ ఆఫ్ 32కి మించి ముందుకు సాగలేకపోయింది. మనికా బాత్రా వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరంజాపే కీలక మ్యాచ్ల్లో సమయంలో లేరు. ప్రాక్టీస్ మ్యాచ్కు మాత్రమే సన్మయ్ పరంజాపే మనికాకు అందుబాటులో ఉన్నారు. జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని మణిక ఆరోపించింది
అమిత్ పంఘల్ టోక్యో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో వెనుదిరిగాడు. తన వ్యక్తిగత కోచ్ అనిల్ ధంకర్ లేకుండానే బరిలోకి దిగాడు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేసి మరీ పంఘల్ చెప్పాడు.
ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్ వినేష్ కి కూడా ఏ విధమైన ప్రైవేట్ ఫిజియోథెరపిస్ట్ ను ఇవ్వ లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.