
కొంత మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఆర్థిక, అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. ఇక కొంత మంది నిరంతరం అప్పుల ఊబిలో చిక్కుకొని ఉంటారు. కానీ ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయంట. అవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయట. ముఖ్యంగా ఈ మూడు సంకేతాలు కనిపిస్తే చాలు ఇంటికి అరిష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలంట.

బౌల్లో నూనె పోస్తుంటే, అది జారి కింద పడి పోవడం, నూనె కింద పోవడం వంటి సంఘటన జరిగినట్లు అయితే, అది అరిష్టానికి సంకేతం. ఇది చాలా అశుభకరం. నూనె శని గ్రహంతో ముడి పడి ఉంటుంది. కాబట్టి, ఇది కింద పడిపోవడం అనేది మీ ఆర్థిక ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అంతే కాకుండా అనేక సమస్యలకు కారణం అవుతుంది. అలాగే మీ పురోగతి ఆగిపోతుంది అనే దానికి సంకేతం అంటున్నారు నిపుణులు.

తులసి మొక్క ఎండిపోవడం : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తులసి మొక్క ఎండిపోవడం అశుభకరం. ఇది ఇంటిలో వాస్తు దోషాలకు కారణం అవుతందంట. అంతే కాకుండా ఇది ఇంటిలో ప్రతి కూల శక్తిని పెంచుతుందంట. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులసి బుధ గ్రహం ప్రభావంతో ఉంటుంది కాబట్టి, ఇది ఇంటికి శాంతిని తెస్తుంది. కానీ ఇది ఎండిపోయింది అంటే, ఇంటికి అరిష్టం పడుతున్నట్లేనంట.

అలాగే ఇంటి పై కప్పుపై చనిపోయిన పక్షులు కనిపించడం అస్సలే మంచిది కాదంట. ఇది శని లేదా రాహు, కేతువు ప్రతి కూల ప్రభావాన్ని సూచిస్తుంది. దీని వలన ఇంటిలోని వారు అనారోగ్య సమస్యలకు గురి అవ్వడం, మానసిక అశాంతి, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయంట. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు, ఇంటిని ఉప్పు నీటితో తుడిచి, ప్రతి నిత్యం పూజలు చేయాలంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు