
అంతే కాకుండా ఈ రోజున సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం వలన అదృష్టం కలిస వస్తుందని చెబుతారు. అందుకే చాలా మంది మకర సంక్రాంతి రోజున , బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి, స్నానం ఆచరించి, సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య భగవానుడిని పూజించడం చేస్తారు.

ఇక మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున పాడి పశువులకు, పంటపొలాలను పూజిస్తారు. ధాన్యం ఇంటికి వచ్చే సందర్భంగా ఈ పండుగను జరుకుంటారు కాబట్టి, ఈ సమయంలో కొత్త ధాన్యంతో పొంగలి తయారు చేసి, నైవేద్యం పెడతారు.

అంతే కాకుండా ఈ రోజున గాలిపటాలు ఎగిరి వేయడం, జల్లికట్టు, కోడి పందాలు వంటి ఆటలతో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ జరుగుతుంది. అయితే ఈరోజు ధాన ధర్మాలు చేయడం చాలా మంచిదంట. దీని వలన సూర్య భగవానుడి ఆశీస్సులు లభించి, పట్టిందల్లా బంగారమే అవుతుందంట. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు ఎవరు అయితే రెండు వస్తువులను దానం చేస్తారో, వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయంట. ఈరోజు సూర్యుడు, శని ఇద్దరి ప్రభావం ఉంటుంది కాబట్టి, వీరి అనుగ్రహ పొందడానికి రెండు వస్తువులు దానం చేయాలంట. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మకర సంక్రాంతి రోజున ఎవరు అయితే బెల్లం దానం చేస్తారో వారికి సూర్యభగవానుడి ఆశీర్వాదం లభిస్తుందంట. ఎవరు అయితే బెల్లం దానం చేస్తారో , వారు సూర్యుడి ఆశీస్సులు పొంది, ప్రతి పనిలో విజయం సాధిస్తారంట. అలాగే వీరి ఇంట ధనప్రవాహం పెరుగుతుంది.

అలాగే మకర సంక్రాంతి రోజున బెల్లంతో పాటు నవ ధాన్యాలు దానం చేయడం చాలా మంచిదంట. ముఖ్యంగా నల్ల నువ్వులు దానం చేయడం వలన శని దేవుడు చాలా సంతోషించి, ఆశీర్వదిస్తాడంట. అందుకే ఈ రోజు నల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిది.