
బుధ గ్రహం ఈ సంవత్సరం డిసెంబర్ 29న ధనస్సు రాశిలోకి సంచారం చేయనుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి బుధ సంచారం. బుధ గ్రహం జనవరి 17వరకు అదే రాశిలో ఉంటాడు. దీని వలన కొన్ని రాశుల వారు అధిక ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందంట. అంతే కాకుండా వీరికి ఏ పని చేసినా కలిసిరాదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. కార్యాలయాల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రెషర్ పెరుగుతుంది. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆదాయం తగ్గిపోతుంది. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తపడాలి లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు. భవిష్యత్తు గురించి ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి 2025లో చివరి బుధ సంచారం వలన అనుకోని ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఖర్చులు అధికం అవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి నష్టాన్ని మిగిల్చుతాయి. అనారోగ్య సమస్యలు తప్పవు.

తుల రాశి : తుల రాశి వారికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబంలో సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. ఏ పని చేయాలి అనుకున్నా ఆటంకాలు ఎదురు అవుతాయి. ఆఫీసులో సీనియర్స్ నుంచి ప్రెషర్ పెరగడం, ఆర్థిక ఇబ్బందులు సమస్యలను తీసుకొస్తాయి.

మీన రాశి : మీన రాశి వారికి బుధ సంచారం కారణంగా ఆర్థికంగా ఎక్కువగా నష్టపోతారు. ఖర్చులు అధికం అవుతాయి. పనుల్లో ఆలస్యం అవుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మిక నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి.