
హిందూ మతంలో శ్రీరామనవమి పండుగకు చాలా ప్రత్యేకత ఉంటుంది. హిందువులు అందరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక శ్రీరామ నవమి ఉగాది పండుగ తర్వాత తొమ్మిదో రోజు, తిథి నవమి రోజున వస్తుంది. అయితే ఈ సారి తిథి విషయంలో కాస్త గందరగోళంగా ఉంది. దీంతో భక్తులు అందరూ కాస్త అయోమయానికి గురి అవుతున్నారు. కాగా, అసలు శ్రీరామ నవమి ఏ రోజు? పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రతి పట్టణంలో, గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. రామాలయాలను అందంగా అలంకరించి, ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ఎప్పుడు అయినా ఈ పండుగను నవమి తిథి రోజున జరుపుతారు. అయితే ఈరోజు నవమి తిథి 26,27 రెండు రోజుల్లో వచ్చింది. దీంతో అసలు శ్రీరామ నవమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

శ్రీరాముడు చైత్ర మాసంలో శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్నంలో జన్మించాడు అని అంటారు. అందుకే ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షమి తొమ్మిదొవ రోజున శ్రీరామ నవమి పండుగను నవమి తిథిలో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

శ్రీరాముడు జన్మించిన రోజు, శ్రీ సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ఇక ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయినా ఇప్పటికీ చాలా మందిలో అసలు శ్రీరామ నవమి ఎప్పుడు జరుపుకోవాలనే గందరగోళం ఉంది. కాగా, అసలు పండితులు దీని గురించి ఏం చెబుతున్నారంటే?హిందూ పంచాంగం ప్రకారం, నవమి తిథి మార్చి 26 గురువారం మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది. అలాగే మార్చి 27 శుక్రవారం మధ్యాహ్నం ముగుస్తుంది.

అలాగే పునర్వసు నక్షత్రం మార్చి 26 రాత్రి ఏడు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై, మార్చి 27 శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా పండుగలను జరుపుకోవడానికి సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అందువలన మార్చి 27 శుక్రవారం రోజున సీతారాముల కళ్యాణం, అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం నిర్వహిస్తారు. అందువలన 2026 మార్చి 27న శ్రీరామ నవమి పండుగను జరుపుకోవాలి అని చెబుతున్నారు పండితులు.