
అందాల ముద్దుగుమ్మ స్టార్ బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న బ్యూటీ, మొదటి సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా స్టార్ హీరోల సరసన నటించి, టాలీవుడ్ స్టార్గా ఓ వెలుగు వెలిగింది.

వరసగా సినిమాలు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్లు కూడా చేస్తూ తన అద్భుతమైన నటనతో అంది మనసు దోచుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ . ఇక కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉండగానే, స్టార్ హీరోను వివాహం చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకే డివోర్స్ తీసుకొని విడిపోయారు.

ఇక పెళ్లి విడాకులు మయోసైటీస్ కారణంగా చాలా రోజుల సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ , సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఖుషి మూవీతో తన అభిమానులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ , చాలా రోజుల తర్వాత మరోసారి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయ్యింది.

మా ఇంటి బంగారం సినిమాతో అభిమానులకు ఆకట్టుకోనుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ, మూవీ టీంతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది. ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని సమంత తన భర్తతో కలిసి దర్శించుకుంది.అలాగేమా ఇంటి బంగారం మూవీ దర్శకురాలు బి.వి నందిని రెడ్డి, శ్రీముఖి కూడా వెంకన్న సేవలో పాల్గొన్నారు. పెళ్లయ్యాక తొలిసారి తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన సమంత దంపతులుకు, మూవీ టీంకు రంగనాయకులను మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

ఇక క్యూలైన్ లో ఆలయం వెలుపల సమంత ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. సమంతతో సెల్ఫీలు ఫోటోలు తీసుకునేందుకు పరుగులు పెట్టారు. మరోవైపు విఐపీ విరామ సమయంలో జబర్దస్త్ టీం శ్రీవారిని దర్శించుకుంది.