
కొన్ని ఆచార సంప్రదాయాల ప్రకారం, పీరియడ్స్ సమయంలో మహిళలు ఆలయాలకు వెళ్లకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు అని చెప్పుకొస్తుంటారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం నమ్మకాల ప్రకారం ఋతుస్రావం సమయంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ప్రదేశాలకు వెళ్ల కూడదంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్మశాన వాటికలు :జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఋతుస్రావం సమయంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో శ్మశాన వాటికకు వెళ్లకూడదంట. ఈ ప్రదేశాలకు వెళ్లడం వలన దుష్టశక్తులు, ప్రతికూల శక్తుల ప్రభావం మీపై ఉండటమే కాకుండా, అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

ఎక్కువ జనాభా ఉండే ప్రదేశాలు : ఎక్కువ జనాభా ఉండే ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాలకు అస్సలే వెళ్లకూడదు. ఇది మీకు మానసిక, శారీరక సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ జనాభా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు అంటున్నారు నిపుణులు.

అంతే కాకుండా మూడు కూడలీలు కలిసే రోడ్లపై కూడా ప్రయాణాలు చేయకూడదు. అటువంటి చోట ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే, అలాంటి చోట క్షుద్ర పూజలు ఎక్కువగా జరుగుతాయి. అది మీపై ప్రతి కూల ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.