
ముఖ్యంగా ఈ రోజున చాలా మంది, ఉదయాన్నే బ్రహ్మముహుర్తంలో నిద్ర లేచి, స్నానం ఆచరించి, శివ పూజ చేస్తారు. అంతే కాకుండా తప్పకుండా శివాలయానికి వెళ్లి పరమశివుడుని పూజిస్తారు. అయితే ఈ రోజు ఆలయానికి వెళ్ళి ఒక వస్తువు మీ వెంట తెచ్చుకుంటే, మీ జన్మ ధన్యం అయినట్లేనంట. ఇంతకీ ఆ వస్తువు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. అయితే ఈ రోజున ఎవరు అయితే శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి శివుడి అనుగ్రహం కలుగుతుందంట. అంతే కాకుండా అభిషేకం తర్వాత కొన్ని వస్తువుల ఇంటికి తెచ్చుకుంటే దారిద్ర్యం దూరమై ఐశ్వర్యాలు కలుగుతాయంట. ఇంతకీ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

అభిషేకం తర్వాత శివుడికి సమర్పించిన బిల్వ పత్రం ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభ ప్రదం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఈ పత్రాన్ని బీరువాలో లేదా, పర్సులో పెట్టుకోవడం వలన అప్పుల సమస్యలు తీరిపోయి. ఆర్థికంగా కలిసి వస్తుందంట.

అదే విధంగా శివాలయంలో పూజ చేసినప్పుడు, పార్వతీ దేవికి సమర్పించిన పూలు, గాజులు, సింధూరం తీసుకొచ్చుకొని, మీరు ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలిగిపోయి, దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందంట. ఆ జంటపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయంట.

అలాగే శివుడికి అభిషేకం చేసిన నీటిని ఇంటికి తీసుకొచ్చు కొని, వాటిని ఇంటిలో చల్లడం వలన ప్రతి కూల శక్తి దూరం అవుతుందంట. ఇంటిలో ఉన్న సమస్యలన్నీ దూరమై, సంతోషకర వాతావరణం నెలకుంటుంది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.