
గ్రహణం సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెబుతుంటారు. అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా గ్రహణం పూర్తి అయిన తర్వాత తప్పకుండా కొన్ని పనులు చేయాలంట. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గ్రహణం పూర్తి అయిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. శుభ్రమైన బట్టలు ధరించి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. దీని వలన ప్రతి కూల శక్తుల ప్రభావం తొలిగిపోయి సానుకూలత పెరుగుతుంది. ఇంటిలో ఉన్న వారు అందరూ కూడా తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.

అదే విధంగా గ్రహణం పూర్తి అయిన తర్వాత మీ ఇంటిలోని పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. అలాగే ఇళ్లు మొత్తం గంగా జలం లేదా పసుపు నీళ్లు చల్లాలి. విగ్రహాలను కడిగి దీపం ముట్టించాలి. దీని వలన ప్రతి కూల శక్తి పూర్తిగా తొలిగిపోతుంది.

అలాగే చాలా మంది గ్రహణానికి ముందు వంటలు వండుకొని ఉంటారు. అందువలన గ్రహణానికి ముందు వండిన అన్నం , కూరలు, పెరుగు, పాలు వంటివి అస్సలే పనికి రావు అంటారు. అందువలన వాటన్నింటి బయటపడవేయాలంట.

అదే విధంగా గ్రహణం తర్వాత దాన ధర్మాలు చేయడం చాలా మంచిదంట. వీలైనంత వరకు గ్రహణం తర్వాత బియ్యం, నువ్వులు, బట్టలు , డబ్బు వీటిని దానం చేయడం వలన వీరికి కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.