భారతదేశంలో అటువంటి అనేక ప్రదేశాలు ఆధ్యాత్మిక ప్రదేశాలున్నాయి. కొన్నింటిలో నేటి వరకు రహస్యాలు ఛేదించలేకపోయారు. ఈ రహస్యాల కారణంగా ఈ ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. హిమాచల్ ప్రదేశ్లోని జటోలా శివాలయం ఈ ప్రదేశాలలో ఒకటి. దీని రహస్యం ఇప్పటికీ పరిష్కరించబడలేదు.
ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లో ఉంది. దేశంలోని నలుమూలల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. ఆసియాలోనే ఎత్తైన దేవాలయాల్లో ఇదొకటి అని పేర్కొన్నారు.
ఆలయం లోపల స్పటిక శివలింగం ఉంది. ఆలయం పైభాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు కలశం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని సందర్శనకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఈ ఆలయంలోని రాళ్లను తట్టడం వల్ల ఢమరుకం శబ్దాలు వస్తాయని చెబుతారు. ద్రవిష్ శైలిలో నిర్మించిన ఈ ఆలయం దాదాపు 111 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు స్వయంగా వచ్చి కొలువుదీరడాని విశ్వాసం.
ఈ ఆలయానికి పునాది 1974లో జరిగింది. కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం పూర్తి కావడానికి 39 ఏళ్లు పట్టింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన డబ్బుతో ఈ ఆలయాన్ని నిర్మించారు.