2023లో దీపోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం 22 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ దీపాల పండుగ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. శ్రీరాముని పట్టాభిషేకం సందర్భంగా 50 ప్రధాన దేశాలకు చెందిన దౌత్యవేత్తలు హాజరుకావడం చాలా ముఖ్యమైన అంశం అని జైవీర్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.
వనవాసాన్ని ముగించుకున్న రామయ్య .. సిత, లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురష్కరించుకుని ప్రజలు తమ సంతోషాన్ని దీపాలు వెలిగించి తెలిపినల్టు పురాణాల కథనం. అప్పటి నుంచి దీపావళి పండగను హిందువులు జరుపుకునే సంప్రదాయం మొదలైంది. అయోధ్యలోనూ గత కొన్నేళ్లుగా ఘనంగా దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దీపాలు వెలిగించినందుకు మరోసారి కొత్త రికార్డు నమోదు కానుంది.
దీపోత్సవంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. 'దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరికీ ఒకే ఒక కోరిక ఉండేది.. అది రామమందిరం నిర్మించాలని. ఆ కోరికను ప్రధాని మోడీ నెరవేర్చారని.. గత 9.5 ఏళ్లలో ప్రధాని మోడీ భారతదేశంలో స్థాపించిన 'రామరాజ్యం' పునాదిని బలోపేతం చేస్తుందని సీఎం యోగి అన్నారు.
రామమందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మార్చేందుకు, నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందన్నారు. అయోధ్యలోని రామజన్మభూమిలో రామ్ లల్లాకు భక్తులు ప్రార్థనలు చేశారు.
అయోధ్యలో దీపోత్సవానికి ముందు సీతారాముల పట్టాభిషేక దృశ్యాన్ని ఆవిష్కరించారు. సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ పాత్రధారులు కూర్చున్న రథాన్ని స్వయంగా యూపీ సీఎం యోగి, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ లాగారు.
కేంద్రంలో మోదీ పాలనను రామరాజ్యంతో పోల్చారు యోగి ఆదిత్యనాథ్. తొమ్మిదేళ్ల కిందట రామరాజ్య స్థాపన జరిగిందనీ, అయితే రామ మందిర నిర్మాణం ఈ పునాదులను పటిష్టం చేసిందని యోగి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీపోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టామనీ, ఇక్కడ రామాలయ నిర్మాణమే అందరి అభిలాషగా మారిందని యోగి వివరించారు.
దీపోత్సవ వేడుకలో ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, కళాకారులు అయోధ్యకు చేరుకున్నారు. ఊరేగింపులో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన జానపద నృత్యాలతో సహా ప్రదర్శనలను చూడటానికి అయోధ్య నలుమూలల నుండి ప్రజలు రోడ్ల వెంట బారులుతీరారు.
రాముడి పై శబరీ భక్తి, లంకా దహనం, రామచరిత మానస్, రాముడి కథల నుండి ప్రేరణ పొందిన నిశ్శబ్ద చిత్రం సహా ఊరేగింపులో ప్రదర్శించారు. అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు.
అయోధ్యలో దీపోత్సవ సంప్రదాయం 2017లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటుతో ప్రారంభమైంది. 2017లో 51,000 దీపాలను వెలిగించడంతో ప్రారంభించి, 2019లో 4.10 లక్షలకు, 2020లో 6 లక్షలకుపైగా, 2021లో 9 లక్షలకు పైగా దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని జరిపారని గిన్నిస్ రికార్డుల్లో పేర్కొంది.
దీపోత్సవ ఊరేగింపులో శ్రీరాముని స్వరూపాన్ని వర్ణించే.. విస్మయపరిచే . దివ్యమైన స్టిల్ చిత్రాలు 18 ప్రదర్శించారు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ . అయోధ్యలో శోభాయాత్ర ఘనంగా జరిగింది. శ్రీరాముని జీవితంలోని వివిధ కోణాలను వర్ణించే స్టిల్స్ ఊరేగింపు అయోధ్యలోని ఉదయ చౌక్ నుండి ప్రారంభించి రామ్ కథా పార్క్ వైపు సాగింది.
అయోధ్యలో దీపావళి దీపోత్సవానికి ఈసారి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి అయోధ్య నిర్మాణం పూర్తికావచ్చింది. గ్రౌండ్ఫ్లోర్ పూర్తయి, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం సాగుతోంది. ఈసారి అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో ఉన్న రాములవారిని భక్తులు దర్శించుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.