
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సర్వ మతాలకు నిలయమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోనూ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. సత్య సాయి నిలయంలో విదేశీయులు ఏసు క్రీస్తును కీర్తిస్తూ గానకచేరి నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి సత్యసాయి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుగుతున్నాయి. సత్యసాయి, ఏసుక్రీస్తు నామస్మరణతో మార్మోగిపోతోంది ప్రశాంతి నిలయం. క్రిస్మస్ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తున్నాయి.

మొదటి రోజు విదేశీయుల గానకచేరి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గంటపాటు పాటలు పాడుతూ సంగీత గానకచేరి నిర్వహించారు ఫారినర్స్. సంప్రదాయ గీతాలను ఆలపిస్తూ సంతోషంగా గడిపారు.

వినాయకుడిని స్తుతిస్తూ తెలుగులో పాడిన పాట అక్కడున్నవారందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది ఓ విదేశీ వనిత.

విదేశీ మహిళలు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తెల్లని చీరలు కట్టుకుని ఏంజెల్స్ను తలపించారు మహిళలు. పురుషులైతే వైట్ అండ్ వైట్ పట్టు పంచెలు కట్టుకొని ఆకట్టుకున్నారు.

60 దేశాల నుంచి సుమారు 2వేలమంది విదేశీయులు తరలివచ్చారు. ఫారినర్స్ రాకతో ప్రశాంతి నిలయం నిలయం కిక్కిరిసిపోయింది. ఇక, క్రిస్మస్ వేడుకల సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది

ప్రశాంతి నిలయం. సాయి కుల్వంత్ సభా మందిరమైతే సర్గాన్ని మరిపిస్తోంది. రంగురంగుల లైట్ల మధ్య కొత్త లోకాన్ని తలపిస్తో్ంది.

విదేశీయుల సందడితో ప్రశాంతి నిలయం కొత్త శోభను సంతరించుకుంది.

పుట్టపర్తి సత్యసాయి ప్రశాంతి నిలయంలో క్రీస్తు పుట్టిన రోజైన ఈ రోజు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. సత్యసాయి, ఏసుక్రీస్తును కీర్తిస్తూ గానకచేరి నిర్వహించనున్నారు ఫారినర్స్.