కాగా, ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని చినజీయర్స్వామికి కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్ హామీ ఇచ్చారు. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'కి నిలువెత్తు నిదర్శనమైన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇందులో భాగంగా 1 వెయ్యి 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు.
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 200 ఎకరాల్లో వేయి కోట్లతో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
ఈ మహోత్సవ ఘట్టానికి దేశంలోని పలువురు ప్రముఖులను స్వయంగా అహ్వానిస్తున్నారు చినజీయర్ స్వామి.
'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'కి నిలువెత్తు నిదర్శనమైన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 1 వెయ్యి 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెం.+91 790 14 2 2022, వెబ్సైట్ Statueofequality.org, ఈ-మెయిల్ Srs.samaroham@statueofequality.org