
హిందూ సంప్రదాయంలో అమావాస్యలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్ర పరిచి, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు. అంతే కాకుండా పితృదేవతలను స్మరించుకొని, వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఈ రోజు కొంత మంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలు చేస్తుంటారు.

ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యే వారు తప్పకుండా అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొన్ని పరిహారాలు పాటించాలంట. అవి ఏవి అంటే? ఎవరు అయితే అమావాస్య రోజు తమ ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తారో, వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయడం వలన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.

అప్పుల బాధలు అన్నీ కూడా తొలిగిపోయి, ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా అమావాస్య రోజు పసుపు, ఉప్పు వేసిన నీటితో ఇంటిని శుభ్రం చేయడం వలన ప్రతి కూల శక్తి తొలిగిపోయి, సానుకూల శక్తి ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అందుకే అమావాస్య రోజున ఇంటిని ఉప్పు నీటితో క్లీన్ చేయాలని చెబుతుంటారు పండితులు.

అలాగే అమావాస్య రోజు సాయంత్రం ఇంటి ముందు దీపం పెట్టడం కూడా చాలా మంచిదంట. దీని వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ తొలిగిపోయి, ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు పండితులు. శని దోషాలు కూడా తొలిగిపోతాయంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు