
పిల్లలు గురించి తెలిసిందే కదా రోజూ సాయంత్రం కాగానే ఏదోకటి చేసి పెట్టమని ఏడిపిస్తూ ఉంటారు అలాంటి వాటిలో చల్లగా తినే ఫుడ్స్ లో బొరుగుల గొట్టం మిక్చర్ కూడా ఒకటి అయితే, దీనిని చిన్న చిన్న ఊర్లలో ఇప్పటికి తింటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈవెనింగ్ కాగానే పట్టణాల్లో విపరీతంగా తింటున్నారు అంతలా ట్రెండ్ అవుతోంది.

బొరుగుల గొట్టం మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పులు గొట్టాలు , ఒక పెద్ద నిమ్మకాయ, రుచికి సరిపడా ఉప్పు, మూడు కప్పుల మరమరాలు, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , అర కప్పు పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర , 10 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి.

మసాలా మిక్స్ రెడీ చేసుకోవాలి: ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో మర మరాలు, గొట్టాలు, జీలకర్ర పొడి, ఇంకా మసాలా పొడి వేసి వాటిని బాగా మిక్స్ చెయ్యాలి. ఇలా చేసి తింటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిశ్రమం రెడీ అయినా తరవాత చిన్న బౌల్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసాన్ని రసాన్ని సిద్ధం చేసుకోవాలి.

పాత్రలో కలుపుకోవాలి: నిమ్మకాయలను కట్ చేసి ఆ రసాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే దీనిలో ముఖ్యం ఎందుకంటే, రుచిని పెంచుతుంది. ఇంకా పాత్ర తీసుకున బొరుగుల గొట్టం మిక్చర్ వేసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , పుదీనా, కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

బొరుగుల గొట్టం మిక్చర్ వలన లాభాలు : పిల్లలకు దీనిని వేసవిలో పెడితే బాడీ మొత్తాన్ని చల్లగా చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే పులుపు, కారం పిల్లల్లో ఉండే నీరసం కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. ఇది ఎక్కువగా విలేజ్ స్టైల్ టేస్ట్ టేస్ట్ తో ఉంటుంది. ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు