
వంటిల్లే వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. మన వంట గదిలో ప్రతిరోజూ ఉపయోగించే వాటితోనే ఎన్నో రకాల జబ్బులు, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు ఇలాంటి గింజలను నానబెట్టి రోజూ తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్యం, అందాన్ని పెంచుకోవడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల జీర్ణ సమస్యలు, చర్మ, జుట్టు సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. జీలకర్ర కూడా నానబెట్టి తింటే చాలా మంచిది. ఇది తింటే డయాబెటీస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇంకా ఎన్నో బెనిఫిట్స్.

వామును కూడా నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు.. అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. సోంపు కూడా నానబెట్టి తీసుకుంటే జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలను తగ్గించి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

తులసి విత్తనాల్లో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని నీటితో కలిపి తింటే.. ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. కలోంజి విత్తనాలు తీసుకోవడం వల్ల కణాల ఆరోగ్యం అనేది పెరుగుతుంది. వీటిని నానబెట్టి తినడం వల్ల వాపు సమస్యలు కంట్రోల్ అవుతాయి.

చియా సీడ్స్తో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రతిరోజూ తీసుకుంటే చాలా సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఆవాలను కూడా నీటిలో నానబెట్టి తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యాన్ని పెంచే సమ్మేళనాలు మెండుగా లభిస్తాయి.