
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన గ్లూకోజ్ అందుతుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ను మెయింటెయిన్ చేస్తుంది. అదే సమయంలో అల్పాహారాన్ని ఎక్కువ సేపు మానేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ఒక నెలపాటు బ్రేక్ఫాస్ట్ని మానేయడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

'అల్పాహారం రాజులాగా, మధ్యాహ్న భోజనం యువరాజులాగా, రాత్రి భోజనం బిచ్చగాడిలాగా తినమని పెద్దలు చెప్పారు. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని రోజుని టిఫిన్ తో ప్రారంభించండి.. ఆ టిఫిన్ లో తీసుకునే ఆహారపదార్ధాలు రుచికరమైనవి మాత్రమె కాదు.. ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉండేవి ఉండాలి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ ప్రతి ఒక్కరి మానసిక స్థితిపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అల్పాహారం ద్వారా మనసికంగా ప్రభావితమవుతారు. ఎవరైనా ఒక నెల పాటు బ్రేక్ఫాస్ట్ని కంటిన్యూగా తినకపోతే.. శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని కారణంగా చిరాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు కూడా పెరుగుతాయి.

అల్పాహారం మానేయడం వల్ల బరువు తగ్గడం కంటే అనారోగ్యకరమైన బరువు పెరగవచ్చు. అల్పాహారం తీసుకోనప్పుడు సాధారణంగా మధ్యాహ్న భోజన సమయంలో అతిగా తింటారు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

అల్పాహారాన్ని స్కిప్ చేయడం వలన మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

అల్పాహారం తీసుకోని వారికి గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అల్పాహారాన్ని తీసుకోవడం మర్చిపోకండి.

అల్పాహారం తినకుండా నెల రోజులు మానివేస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అల్పాహారం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

అల్పాహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అల్పాహారం తీసుకోకపోతే శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లోపించవచ్చు. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది.