వయసు ముదురుతున్న కొద్దీ ముఖంపై ముడతలు సహజం. అయితే మొటిమలు కూడా వస్తూ ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు. సాధారణంగా ముఖంపై మొటిమలు టీనేజర్స్ లో వస్తూ ఉంటాయి.
వాటిని తొలగించుకోవడం కోసం నానా తిప్పలుపడుతూ ఉంటారు. అనేక క్రీములు, టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఆ వయసు వెళ్లిపోయిన వెంటనే మొటిమలు కూడా క్రమంగా కనుమరుగవుతూ ఉంటాయి.
అవి తిరిగి 40 ఏళ్ల తరువాత మళ్ళీ వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. ఎన్ని క్రీములు వాడినా ఫలితం ఉండదంటున్నారు. వీటిని సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించి నయం చూసుకోవచ్చు అంటున్నారు.
జిలకర్ర, లవంగం, ముల్తానీ మట్టి, ఈ మూడింటితో మొటిమలు దూరం అవుతాయంటున్నారు వైద్య నిపుణులు. ముందుగా ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ వేసి కలిపి ఆ క్రీమ్ ను మొటిమలు ఉన్న ఉన్నచోటు రాయాలి. 15 నిముషాలు బాగా ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు ప్రకారం 12 వారాలు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మొటిమల ద్వారా ఏర్పడిన మచ్చలు కూడా అంతరించి పోతాయంటున్నారు ఆయుర్వేద పండితులు.