Shiva Prajapati |
Jan 15, 2023 | 8:03 AM
సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిచారు ముఖ్యమంత్రి జగన్. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఏపీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఆయన సతీమణి భారతి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి దంపతులు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో ఆనందాల సిరులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు.
తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలతో గోశాల కళకళకలాడింది.
క్యాంపు కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలను సీఎం జగన్, భారతి దంపతులు ఉత్సాహంగా తిలకించారు. ఈ వేడుకల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ముఖ్యులు పాల్గొన్నారు.