
ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు వీటిని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే, ఇవి వాసన వస్తాయి కాబట్టి. మీకు అదే సమస్య అయితే ఇల ఎండు చేపలను కాల్చి తింటే ఆ రుచే వేరు. వాసన అస్సలు ఉండదు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

కాల్చిన ఎండు చేపల కూరకు కావాల్సిన పదార్దాలు: పావుకిలో ఎండు చేప, రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు టమాటాలు 2, 5 పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు గుజ్జు, కరివేపాకు, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి

కాల్చిన ఎండు చేపల కూర తయారి విధానం: ముందుగా ఎండు చేపలను తీసుకుని వాటిని బాగా కడిగి 20 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఆ తరవాత ఈ నీటిని వంపేయాలి. ఇంకా పెనం మీద కానీ నేరుగా పుల్లల పొయ్యి మీద కానీ ఈ ఎండు చేపలను చక్కగా కాల్చాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

కాల్చిన ఎండు చేపల కూర తయారి విధానం స్టెప్ 1 : పాన్ లో ఆయిల్ చేసి అది బాగా వేడి ఆయిన తరువాత కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, నాలుగు ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వేయించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వీటిని బాగా వేయించి పెట్టుకోవాలి.

కాల్చిన ఎండు చేపల కూర తయారి విధానం స్టెప్ 2: ఇంకా కట్ చేసిన టమాటాలు కూడావేసి మెత్తబడిన తర్వాత దీనిలో కారం, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచం పసుపు వేసి కలపాలి. వీటితో పాటు చింతపండు గుజ్జు నీరు కూడా పోసి మరిగించాలి. ఇప్పుడు కాల్చిన ఎండు చేపలను దీనిలో వేసి మీడియం మంటపై ఉంచి ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేయించాలి.