బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్ల తక్కువ ప్రోటీన్ను ఎక్కువ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే మన భారతదేశంలో ప్రతి భోజనంలో బియ్యం లేదా రోటీలు ఉండాల్సిందే.. కానీ అందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అయితే బరువు తగ్గేదేలా అని అనుకుంటున్నారా?
బరువు తగ్గాలని అనుకునేవారు రాత్రి పూట తేలికపాటి భోజనం తీసుకోవాలి. అయితే వారికి ఒక్క డౌట్ ఉంటుంది. అన్నం రోటీలో ఏది తీసుకుంటే బెటర్ అని..వరిలో అతితక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. అలాగే 120 గ్రాముల గోధుమలలో 190 mg సోడియం ఉంటుంది.
60 గ్రాముల బియ్యంలో 80 కేలరీలు, 1 గ్రా ప్రోటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 18 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రోటీని గోధుమల నుండి తయారు చేస్తారు కాబట్టి బియ్యంతో పోలిస్తే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
రోటీని గోధుమల నుండి తయారు చేస్తారు కాబట్టి బియ్యంతో పోలిస్తే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒక చిన్న 6-అంగుళాల రోటీలో దాదాపు 71 కేలరీలు, 3 gm ప్రోటీన్, 0.4 gm కొవ్వు 15 gm కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గోధుమలతో పోలిస్తే వరిలో మెగ్నీషియం తక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా, బియ్యం గోధుమలు రెండూ ఒకే పరిమాణంలో ఫోలేట్, ఐరన్ కలిగి ఉంటాయి.అన్నం, రోటీ రెండూ వాటి స్వంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బియ్యం పప్పు కలిసి అందులో అన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి.
జొన్న, బార్లీ, వేలు లేదా ముత్యాల మిల్లెట్తో చేసిన రోటీ వల్ల కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు మీకు అందుతాయి. రెండూ మంచి ఎంపికలే కావడంతో.. ఒక్కరోజు అన్నం మరోరోజు రోటి తింటే బాగుంటుంది
అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం వారు తీసుకునే పోర్షన్ సైజ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి 8 గంటలలోపు డిన్నర్ చేసేలా చూసుకోవాలి.