
ఈ భూమి పైన మనకి తెలియనివి ఎన్నో మొక్కలు ఉన్నాయి వాటిలో ఈ ఆకులు కూడా ఒకటి . ఈ మొక్కను ఆయుర్వేదంలో బాగా వాడుతారు. అంతే కాదు ప్రత్యేక స్థానం కలిగిన ఔషధ మొక్క. ఈ మొక్క ఆకులతో చేసిన పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు అంటున్నారు. మరి, దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

పునర్నవ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు: రెండు కప్పుల పునర్నవ ఆకులు, నాలుగు పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , రెండు ఎండుమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

ముందుగా పునర్నవ ఆకులను బాగా కడిగి వాటి మీద ఉన్న మట్టి పోయేవరకు శుభ్రం చేసుకోవాలి. ఆ తరవాత ఈ ఆకులను తీసుకుని స్టవ్ మీద పెట్టిన ఒక పాన్ లో నూనెతో పాటు వీటిని బాగా వేయించాలి ఆ తరవాత ఇది బాగా వేడయ్యాక నాలుగు పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర కూడా వేసి మీడియం మంటపై వేయించాలి. సువాసన వచ్చే వరకు బాగా వేయించాలి.

అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి పునర్నవ ఆకులను వేసి అవి వేగే వరకు కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అలాగే వీటిని పచ్చివాసన పొయ్యే వారికీ మెత్తగా బాగా ఉడికించాలి. ఇలా చేస్తే ఈ పచ్చడికి అదిరిపోయే ట్ టేస్ట్ వస్తుంది. ఈ ఆకులను మగ్గితే అన్నంలోకి కూడా బావుంటుంది

ఆ తర్వాత చింతపండును నానాబెట్టి వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీనిలో వేయించిన పచ్చిమిర్చి, ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇక చివర్లో వేయించిన పునర్నవ ఆకులను కూడా వేసి పచ్చడిలా మెత్తగా రుబ్బుకోవాలి. చివర్లో తాలింపు పెట్టుకుని దీనిని తినడమే.