
కావలసిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, రెండు గ్లాస్ ల నీళ్ళు, రెండు పెద్ద ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు వేసి, తగినన్ని నీళ్లు పోసి జోరుగా అది కలిసే పోయే వరకు కలుపుతూనే ఉండండి.

ముందుగా రెడీ చెసి పెట్టుకున్న పిండిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరను వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి.

ఇక ఇప్పుడు పెనం వేడి చేసి దానిలో కొద్దిగా నూనె వేయండి. ముందుగా సిద్ధం చెసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెనంపై పోసి మీడియం మంటపై దానిని రెండు వైపులా బాగా కాల్చాలి.

ఆమ్లెట్ మరింత మెత్తగా, దూదిగా రావాలంటే రావడానికి, ఒక చిటికెడు బేకింగ్ సోడాను కలుపుకుంటే సరిపోతోంది.లేదా పిండిలో బియ్యప్పిండి లేదా సూజీ రవ్వ కలిపితే ఆమ్లెట్ క్రిస్పీగా వస్తుంది.