
ఇది వరకు రోజుల్లో ఇలాగే చేసి తినే వాళ్లు. ఇంకా ఇంట్లో ఉన్న కొద్ది పదార్థాలతోనే ఈ స్వీట్ ను తయారు చేస్తారు. ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కూడా అవసరం లేదు కేవలం ఒక కప్పు బియ్యంతోనే ఈ స్వీట్ తయారవుతుంది. ఈ తీపి వంటకం ఒకసారి నోట్లో వేసుకుంటే మొత్తం వెన్నలా కరిగిపోతుంది. మీరు దీని కోసం ఎక్కువ డబ్బు కూడా పెట్టాల్సిన అవసరం లేదు.

ఈ పేదోళ్ళ స్వీట్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, ఒక కప్పు బెల్లం తురుము , రెండు కప్పుల నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ,10 జీడిపప్పు, 10 కిస్మిస్ లు తీసుకోవాలి. అలాగే, దీనిని సరైన కొలతలతో చేస్తే రుచిగా ఉంటుంది. మీరు కూడా పక్కాగా దీనిని ట్రై చేయండి.

పేదోళ్ళ స్వీట్ తయారీ విధానం: ముందుగా ఈ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు పాటు నానబెట్టుకోవాలి. ఇంకా నానిన బియ్యాన్ని తీసి దానిలో ఉన్న నీరు మొత్తన్నీ వంపి వాటిని మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా రుబ్బుకవాలి ఇంకా ఒక గిన్నెలో నీరు కూడా పోసి దానిలో బెల్లాన్ని కొంచం కరిగించుకోవాలి.

ఇప్పుడు బెల్లాన్నీ కూడా పాకంలాగా చేసుకోవాలి ఆ తరవాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లగా అయినా తరవాత అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి ఇంకా దీనిలో ఇష్టమైతే నెయ్యిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకోండి. కలపండి. ఇలా చేసిన దానిని మరో 10 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు బియ్యపు పిండిని తీసుకుని చిన్న బోండాలుగా చేసుకుని నూనెలో గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇలా వేయించిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని బెల్లం పాకంలో వేయాలి . వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు ఇంకా దీనిని చల్లారిన తర్వాత తింటే ఇంకో రుచి వస్తుంది. నోట్లో పెట్టగానే వెన్నెల కరిగిపోయే స్వీట్ అందరికీ నచ్చుతుంది.