Raksha Bandhan 2021: అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్న ఏపీ, తెలంగాణ లీడర్స్.. ఫోటోలు

నేడు రాఖీ పండుగ సందర్భంగా సామాన్యులే కాదు. ప్రజాప్రతినిధులు కూడా తమ అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకొని సంబరాలు చేసుకుంటున్నారు. వారికి బహమతులు ఇస్తూ ..ఎప్పటికీ రక్షగా ఉంటానని దీవెనలందిస్తున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 1:58 pm, Sun, 22 August 21
1/6
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత రాఖీలు కట్టారు.
2/6
రాఖీలు కట్టిన మహిళా నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు
3/6
ఇక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్లో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పలువరు మహిళలు ఆయనకు రాఖీ కట్టారు.
4/6
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌‌కు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు
5/6
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు
6/6
సికింద్రాబాద్‌లో వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌కు రాఖలు కట్టారు సోదరీమణులు. ఆ తర్వాత వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు మంత్రి.
Ads By Adgebra

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే దాకా వెళ్లింది.