
ఒడిశా రైలు ప్రమాద స్థలానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుని పరిశీలించారు.ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు.

ప్రమాదం జరిగిన తీరుపై స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ఆయన మాట్లాడారు.

రైలు ప్రమాద స్థలంలో మృతుల వివరాలు, క్షతగాత్రుల వివరాలను అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారు.

రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ.. అనంతరం అక్కడి నుంచి క్షగాత్రులను పరామర్శించేందుకు బయలుదేరారు.

రైలు ప్రమాద స్థలంలో రైలు బోగీలు చెల్లచెదురుగా పడిపోయాయి. దీంతో ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

రైలు ప్రమాద స్థలంలో మూడు రైళ్లు ఢీకొనడంతో రైలు బోగీలు నుజ్జు నుజ్జుగా మారాయి. దీంతో అక్కడి ప్రదేశంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.